దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మళ్ళీ క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 2067 కరోనా కేసులు, 40 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,47,594 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,22,006 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, కేరళ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 1547 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,25,13,248 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 12 వేలకుపైగా (12,340 – 0.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఏప్రిల్ 19 (8am)–ఏప్రిల్ 20 (8am)):
- ఢిల్లీ – 632
- కేరళ – 488
- హర్యానా – 249
- ఉత్తర్ ప్రదేశ్ – 159
- మహారాష్ట్ర – 137
- మిజోరాం – 125
- కర్ణాటక – 62
- తమిళనాడు – 30
- పశ్చిమబెంగాల్ – 23
- రాజస్థాన్ – 23
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ