దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా ఎక్కువుగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా నమోదయ్యే కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువున్నాయి. ఇక గత 24 గంటల్లో 2 వేలకుపైగా (2,364) పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,29,563 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 10 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,24,303 కి పెరిగింది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (596), ఢిల్లీ (532), మహారాష్ట్ర (307), హర్యానా (257), ఉత్తర్ ప్రదేశ్ (139), కర్ణాటక (122) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి.
ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.75 శాతంగానూ, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి 15,419 (0.04%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,582 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,25,89,841 కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మే 19, బుధవారం ఉదయం 7 గంటల వరకు 191.79 కోట్లకుపైగా (1,91,79,96,905) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. గత 24 గంటల్లో 13,71,603 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF