ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్లో గల మొతేరా క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా మొతేరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చినట్టు ప్రకటించారు. ముందుగా 2015 అక్టోబర్ నుంచి ఈ స్టేడియంలో పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి 2020 ఫిబ్రవరికి పూర్తిచేశారు. మొత్తం 63 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టేడియం 1 లక్షా 10 వేలు సీటింగ్ సామర్ధ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది.
6 ఇండోర్, 3 అవుట్డోర్ ప్రాక్టీస్ పిచ్లుతో పాటుగా జిమ్ సౌకర్యంతో కూడిన 4 డ్రెస్సింగ్ రూమ్లు, 76 కార్పొరేట్ బాక్స్లు, 3000 కార్లు, 10000 ద్విచక్ర వాహనాలకు సరిపడా పార్కింగ్ స్పేస్, ప్రత్యేక ఆకర్షణతో కూడిన ఎల్ఈడీ లైట్లు ఇలా ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో రూ.800 కోట్లతో ఈ స్టేడియాన్ని పునరుద్దరించారు. ఈ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ గా నేడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడోదైనా డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు జరగబోతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ