భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా పండుగ సందర్భంగా మంగళవారం దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి ఒక సందేశం పంచుకున్నారు. విజయదశమి శుభ సందర్భంగా, నా తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెడుపై మంచి, అసత్యంపై సత్యం, అనైతికతపై నైతికత సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను భారతదేశమంతటా జరుపుకుంటున్నారు’ అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.
विजयादशमी के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक बधाई।
दशहरा का यह त्योहार, अनीति पर नीति की, असत्य पर सत्य की और बुराई पर अच्छाई की विजय का प्रतीक है।
मेरी मंगल कामना है कि यह त्योहार सभी देशवासियों के जीवन में सुख, शांति और समृद्धि का संचार करे।
— President of India (@rashtrapatibhvn) October 5, 2022
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దసరా పండుగ సందర్భంగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. ‘విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, సంయమనం మరియు సానుకూల శక్తిని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
सभी देशवासियों को विजय के प्रतीक-पर्व विजयादशमी की बहुत-बहुत बधाई। मेरी कामना है कि यह पावन अवसर हर किसी के जीवन में साहस, संयम और सकारात्मक ऊर्जा लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 5, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY