తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26 , గురువారం నాడు మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44 కు చేరుకుంది. ఇద్దరు డాక్టర్లుతో పాటుగా, మరో వ్యక్తికీ కరోనా పాజిటివ్ తేలినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్కి చెందిన 49 ఏళ్ల వ్యక్తి కి వైరస్ సోకిందని, ఇతనికి ఢిల్లీ ప్రయాణ నేపధ్యం ఉన్నట్టు తెలిపారు. అలాగే దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు డాక్టర్స్ సాంపిల్స్ పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలియజేశారు. వీరిలో భర్త నుంచి ఆయన భార్యకూ వైరస్ సోకినట్టుగా ప్రకటించారు. దీంతో కరోనా వైరస్ ప్రైమరీ కాంటాక్ట్ సంఖ్య 9కి చేరుకుంది.
Home తెలంగాణ
- Advertisement -