తెలంగాణలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందేందుకు రాసిన టీఎస్ పాలీసెట్ పరీక్షల ఫలితాలు రేపు (శుక్రవారం, మే 26, 2023) విడుదల కానున్నాయి. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎస్బీటీఈటీ సెక్రటరీ డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. కాగా మే 17వ తేదీన పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించగా.. 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఈ సెట్లో ఉత్తీర్ణులైనవారు నేరుగా ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత డిప్లొమా కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ కళాశాల్లో చదువుకునే వీలుంది.
ఇక దీనికి సంబంధించి అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ వంటి కోర్సులను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సీటీలు అందిస్తున్నాయి. ఇక మే 17వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు చొప్పున మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 98,273 మంది పరీక్షకు హాజరవగా.. వీరిలో 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE