ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ కాలేజీల్లో తరగతులు నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరాన్ని కోల్పోవడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్ సిలబస్ను 30 శాతం మేర కుదిస్తునట్టు ప్రకటించింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి పాఠ్యాంశాల వారీగా కుదించిన సిలబస్ వివరాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లో స్టూడెంట్స్ విభాగంలో అందుబాటులో ఉంచారు. లాంగ్వేజ్లకు సంబంధించిన సిలబస్ వివరాలను కూడా త్వరలోనే వెబ్ సైట్ లో ఉంచనున్నారు. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా 2020–21 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈ బోర్డు కూడా 30 శాతం సిలబస్ కుదిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu