ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతాలను అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో వరదల వలన నష్టపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ (ఏపీఎండీసీ) తమవంతు చేయూతగా రూ.5 కోట్ల భారీ విరాళం అందజేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళానికి సంబంధించిన చెక్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించింది. సోమవారం గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేశారు. వరద సహాయక చర్యలకు దీనిని ఉపయోగించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏపీఎండీసీ అధికారులని అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ