దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ రెండో శనివారం సెలవును ఏపి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నిర్వహణలో భాగంగా పాఠశాలల్లో.. సెమినార్ లు, బృంద చర్చలు, వ్యాస రచన, క్విజ్, నృత్యం, డ్రామా, మ్యూజిక్, పెయింటింగ్, హెరిటేజ్ వాక్, సైకిల్ ర్యాలీస్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY