జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే.. త్వరలోనే అధికారిక ప్రకటన

Janasena, janasena mp candidates, anakapalli, nagababu, pavan kalyan,Machilipatnam,Vallabhaneni Balasouri,BJP,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Janasena, janasena mp candidates, anakapalli, nagababu, pavan kalyan

మొత్తానికి తెలుగు దేశం-జనసేన పార్టీలు స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ఈసారి 24 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన సోటీ చేస్తోంది. ఈ మేరకు 24 స్థానాల్లో 5 స్థానాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అటు మిగిలిన స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగుతోంది. ఈక్రమంలో 94 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే బీజేపీ కూడా కూటమితో జతకట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మరోసారి సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ 3 లోక్ సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ స్థానాల్లో ఈసారి జనసేన పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాలు ఇవ్వాలని జనసేన పట్టుబట్టినప్పటికీ.. చంద్రబాబు మాత్రం 3 స్థానాలకంటే ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వమని భీష్మించుకొని కూర్చున్నారట. దీంతో జనసేన 3 స్థానాలతో సరిపెట్టుకుందట. ఇక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే ఇప్పుడు నిజం కాబోతోందని.. త్వరలోనే పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి నాగబాబు పేరు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

ఇకపోతే మచిలీపట్నం నుంచి జనసేన తరుపున వల్లభనేని బాలశౌరి పేరు వినిపిస్తోంది. ఈసారి బాలశౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతున్నారట. అలాగే కాకినాడ నుంచి సానా సతీష్‌ను బరిలోకి దించాలని పవన్ అనుకుంటున్నారట. నియోజకవర్గంలో ఆయనకు మంచి బలం, బలగం ఉండడంతో పాటు సర్వేలన్నీ సతీష్‌కు అనుకూలంగా రావడంతో.. ఆయన్ను పోటీ చేయించాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఈ ముగ్గురి పేర్లను దాదాపు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారని.. అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కూటమితో జత కట్టాలంటే బీజేపీ 8 నుంచి 10 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని కోరుతోందట. బీజేపీ కోరుతున్న స్థానాల్లో కాకినాడ కూడా ఉందట. ఇప్పుడుగనుక బీజేపీ పొత్తుకూడితో ఆ స్థానాన్ని జనసేన.. బీజేపీకి త్యాగం చేయాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరో స్థానం పోటీ చేయడం లేదా.. 2 స్థానాలతో సర్దిపెట్టుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eleven =