ప్రముఖ స్వాత్రంత్య యోధుడు, దేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి/పుణ్య తిథి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ఎనలేని సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “సర్దార్ పటేల్కు ఆయన పుణ్య తిథి నాడు నివాళులర్పిస్తున్నాను. భారతదేశానికి, ముఖ్యంగా మన దేశాన్ని ఏకం చేయడంలో మరియు సర్వతోముఖాభివృద్ధికి ఊతమివ్వడంలో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “సర్దార్ పటేల్ కేవలం ఊహాశక్తి ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, తన ఊహలను నిజం చేసేందుకు కృషి చేసిన కర్మయోగి. హిమాలయాల వంటి బలమైన సంకల్పం మరియు నాయకత్వ సామర్థ్యం కారణంగా దేశం అతన్ని సర్దార్గా పరిగణించింది. జాతి స్ఫూర్తి అయిన సర్దార్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE