రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నిలవగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో నిలిచారు. అయితే దేశవ్యాప్తంగా శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా, బిజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ వంటి పలు ప్రాంతీయ పార్టీలు ముర్ముకు తమ మద్దతును అందించడంతో ఆమె విజయం లాంఛనమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రాష్ట్రాల అసెంబ్లీల నుంచి బ్యాలెట్ బాక్స్ లు రోడ్డు మరియు వాయుమార్గం ద్వారా ఢిల్లీకి చేర్చనున్నారు. వీటితో పాటుగా ఆయా రాష్ట్రాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉంటారని అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ వెల్లడించారు. పార్లమెంట్లో మొత్తం ఓటింగ్ శాతం 99.18 నమోదైనట్లు, అలాగే దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఆయన ప్రకటించారు. ఇక ఎన్నికల ఫలితాలను ఈ నెల 21న ప్రకటించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా, జూలై 25వ తేదీన నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ