ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 12 కార్పొరేషన్లకు మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు బుధవారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.88% పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 75.93 శాతం పోలింగ్ నమోదు కాగా, కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 14 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం వివరాలు:
- తూర్పుగోదావరి: 75.93
- ప్రకాశం: 75.49
- శ్రీకాకుళం: 71.52
- నెల్లూరు: 71.06
- విజయనగరం: 68.22
- అనంతపురం: 66.11
- కడప: 65.01
- చిత్తూరు జిల్లా: 62.21
- పశ్చిమగోదావరి: 62.02
- గుంటూరు: 61.77
- కృష్ణా: 61.31
- విశాఖపట్నం: 56.83
- కర్నూలు: 55.87
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ