తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. అలాగే ఆంధప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై సిఫార్సులు చేసినట్టుగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ను ఉత్తరాఖండ్కు బదిలీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఏపీ సీజే గా ఉన్న జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు సీజే గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా జస్టిస్ హిమా కోహ్లీ నిలిచారు. ఏపీ, తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ