మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఓవైపు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మునుగోడు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, మరోవైపు నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న నేతలు ప్రస్తుతం ఉన్న పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. శనివారం కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే పల్లె రవికుమార్ గౌడ్ మునుగోడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు. ఆయన సతీమణి కళ్యాణి చండూరు ఎంపీపీగా ఉన్నారు. పల్లె రవి దంపతులకు మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఉద్యమ కాలం నుంచి కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే పల్లె రవి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో అన్ కండిషనల్ గా చేరామని, నవంబర్ 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ చేరిక కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు మర్రి రాజశేఖర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY