మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో సర్వే నంబర్ 130లో, హకీంపేటలో సర్వే నంబర్ 97లో సర్వే చేపట్టడానికి సంబంధించి ఈటల రాజేందర్ సతీమణి జమున, కుమారుడు నితిన్రెడ్డికి తూప్రాన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఈ భూముల సర్వేపై జూన్ మూడవ వారంలో నోటీసులు ఇవ్వడం జరిగిందని, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున సర్వే చేయడానికి వీలుపడలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన సర్వే నోటీసుకు ఫైల్స్ కు కొనసాగింపుగా అచ్చంపేట సర్వే నంబర్ 130లో ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 నుంచి, హకీంపేటలో సర్వే నంబర్ 97లో ఈ నెల 18వ తేదీ ఉదయం 10.30 నుండి సర్వే చేయబడుతుందని, ఈ సర్వే సమయంలో నిర్ణిత ప్రదేశంలో హాజరుకావాలని ఈటల జమున, ఈటల నితిన్రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు జమునా హ్యాచరీస్ వద్ద అధికారులు నోటీసులు అంటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ