ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్థికశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖలో వ్యవహారాలపై సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న అభియోగాలతో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఆర్థికశాఖలో సెక్షన్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న శ్రీనుబాబు, వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ముఖ్యకారదర్శి షంషేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సస్పెండ్ అయిన ముగ్గురు ఉద్యోగులు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ