తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్ సహా పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.
టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు:
- 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం.
- టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం.
- ఏప్రిల్ 14 ఉగాది పండుగ రోజు నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం.
- రథసప్తమి వాహన సేవలను వైభవంగా నిర్వహణ.
- తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ఏర్పాటు.
- శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అన్నదానం చేయాలని నిర్ణయం.
- ముంబయి, జమ్మూ కాశ్మీర్ లో శ్రీవారి ఆలయాల నిర్మాణం త్వరలో ప్రారంభం.
- దేశంలోని అన్ని టీటీడీ కళ్యాణ మండపాలు అభివృద్ధి, వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు.
- టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయం.
- తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు రూ.9 కోట్లు కేటాయింపు.
- నెయ్యి నిల్వ ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయం.
- అయోధ్యలో టీటీడీకి భూమి కేటాయించాలని అక్కడి ప్రభుత్వానికి విన్నపం. శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయం నిర్మించాలని నిర్ణయం.
- తిరుమలలోని అతిధి గృహాల్లో విద్యుత్ వృథాను నియంత్రణకు ఎనర్జీ మీటర్లు ఏర్పాటు.
- గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ