యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు నూతన ఛైర్మన్ గా మామిడాల జగదీష్ కుమార్ ను నియమించబడ్డారు. తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ గా ఉన్నారు. యూజీసీ ఛైర్మన్ గా ఉన్న డిపి సింగ్ రాజీనామా అనంతరం, గత డిసెంబర్ 7 నుంచి ఆ పదవీ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జగదీష్ కుమార్ ను యూజీసీ ఛైర్మన్ గా నియమిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవీలో ఆయన ఐదేళ్ల పాటుగా కొనసాగనున్నారు.
జగదీష్ కుమార్ ప్రస్తుతం జేఎన్యూ వైస్-ఛాన్సలర్ గానే కాకుండా ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే గతంలో ఐఐటీ ఖరగ్పూర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఐఐటీ ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి ఏంఎస్ మరియు పీహెఛ్డీ పట్టాలను పొందారు. మరోవైపు యూజీసీ ఛైర్మన్ గా నియమించబడ్డ మూడో తెలుగు వ్యక్తిగా జగదీష్ కుమార్ నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ