టీ20 ప్రపంచ కప్-2022 లో గ్రూప్-1 కు సంబంధించి సూపర్-12 రౌండ్ మ్యాచ్ లు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. గ్రూప్-1 నుంచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించగా, తాజాగా గ్రూప్-1 నుంచి సెమీస్ కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో శ్రీలంక పై జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలుపుతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు షాక్ తగిలి, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-1లో సూపర్-12 రౌండ్ పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ (7 పాయింట్లు, +2.113 నెట్ రన్రేట్), ఇంగ్లాండ్ (7 పాయింట్లు, +0.473 నెట్ రన్రేట్), ఆస్ట్రేలియా (7 పాయింట్లు, -0.173 నెట్ రన్రేట్) జట్లు సమాన పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్రేట్ ఆధారంగా న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. అయితే ఇప్పటివరకు T20 ప్రపంచకప్ టైటిల్ ను ఆతిథ్య దేశాలు ఎప్పుడూ గెలుచుకోలేకపోవడం గమనార్హం. అలాగే గ్రూప్-1 లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు కూడా ఇంటిముఖం పట్టాయి.
ఇంగ్లాండ్ సెమీస్ కు చేరిన విధానం(సూపర్-12 – గ్రూప్-1 – 7 పాయింట్స్ – +0.473 నెట్ రన్రేట్):
- అక్టోబర్ 22 – ఆఫ్ఘనిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం
- అక్టోబర్ 26 – ఐర్లాండ్ పై 5 పరుగులతో పరాజయం(డీఎల్ఎస్ మెథడ్)
- అక్టోబర్ 28 – ఆస్ట్రేలియా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
- నవంబర్ 1 – న్యూజిలాండ్ పై 20 పరుగులతో విజయం
- నవంబర్ 5 – శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో విజయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE