తెలంగాణలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2022లో జరగనున్న మేడారం మహా జాతరను ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు మేడారం పూజారులు ఆదివారం నాడు ప్రకటించారు. మాఘమాసంలో నాలుగు రోజులపాటుగా సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా జరపనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీన సారలమ్మ దేవత, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకురావడం, ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుట, ఫిబ్రవరి 18న సమ్మక్క-సారలమ్మలకు ప్రజలు మొక్కులు సమర్పించుట, ఫిబ్రవరి 19 న వన ప్రవేశం, మహా జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయని పూజారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 1, 2021 నుంచి మే 15, 2021 వరకు మేడారం అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ