అనకాపల్లి ప్రచారంలో రాబోయే ఎన్నికల కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి కంటే ఎక్కువగా సినీ నటులే కనిపిస్తున్నారు. అభ్యర్థి సినీనటుడు కాకపోయినా.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోయినా కూడా ప్రచారంలో సెలబ్రెటీలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. హైపర్ ఆది, జబర్దస్త్ అప్పారావు, పృథ్వీరాజ్ వరకూ చాలా మంది కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
అనకాపల్లి జనసేనకు కేటాయించడంతో పాటు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పోటీ చేయడంతో సెలబ్రెటీల సందడి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ముందు నుంచీ కూడా సినీ నటులకు విపరీతమైన ఆదరణ ఉండడంతో.. జనసేనకు మద్దతుగా వీరంతా రంగంలోకి దిగారు. కొణతాల రామకృష్ణ అల్లుడు అయిన చిన్ని సినీ డైరక్టర్ అవడంతో ఆ పరిచయంతో కూడా కొంతమంది సెలబ్రెటీలు .
అనకాపల్లిలోని గాంధీ నగర్లో గురువారం ఉదయం ..ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణతో సినీ నటుడు పృథ్వీరాజ్ ప్రచారంలో పాల్గొన్నారు. గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రచారం ప్రారంభించారు. వీరికి ఏ వీధిలోకి వెళ్లినా మహిళలు హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. గాంధీ నగర్ టీడీపీ, జనసేన శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సినీ నటుడు పృథ్వీరాజ్ని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి పిల్లలు, యువకులు, మహిళలు ఉర్రూతలూగారు.
బీజేపీ నేత సీఎం రమేష్.. అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా ఖరారవగానే.. వెంటనే మెగాస్టార్ చిరంజీవిని కలిసి మద్దతు కోరారు. ఆ తరువాత పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి వెళ్లి రెండో సారి చిరంజీవిని కలిసి ఏకంగా వీడియో సందేశాన్ని ఇప్పించారు. సీఎం రమేష్ తనకు అత్యంత ఆప్తుడని, తను అనకాపల్లి నుంచి ఎంపిక అవడం అక్కడ ప్రజల అదృష్టమవుతుందని చిరంజీవి తన వీడియోలో చెప్పారు. మొత్తంగా ఎన్నికల పుణ్యమా అని సినీ సెలబ్రెటీలను చూడాలన్న అనకాపల్లి వాసుల కోరిక తీరుతోందని అక్కడి వాళ్లు తెగ సంబరపడిపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY