ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే వైసీపీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. త్వరలో పూర్తి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు కూడా స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశమై సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మరోసారి సమావేశమయ్యారు.
ఆదివారం రెండుసార్లు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు.. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆదివారం రాత్రి కూడా మరోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయబోయే స్థానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
జనసేన బలంగా ఉన్న 35 స్థానాలను చంద్రబాబు జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి ఓ జాబితా వైరలవుతోంది. రాజోల్, అమలాపురం, పిఠాపురం, రాజానగరం, విశాఖ సౌత్, కాకినాడ రూరల్, ఉంగుటూరు, దర్శి, అనంతపూర్, రాజమండ్రి, నెల్లిమర్ల, తెనాలి, నరసాపురం, భీమవరం, రైల్వే కోడూరు, తాడేపల్లిగూడెం, కొత్తపేట, పోలవరం, విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్-వెస్ట్, ఎలమంచిలి, పెందుర్తి, అవనిగడ్డ, గాజువాక, భీమిలి, పెడన, నిడదవోలు, ఏలూరు, తణుకు, పి.గన్నవరం, రాజంపేట, తిరుపతి, నెల్లూరు అర్బన్/రూరల్, మదనపల్లె, కైకలూరు స్థానాలను జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE