దేశంలో బ్యాంకులు మరియు రైల్వేల ప్రైవేటీకరణపై బిజెపి నాయకుడు వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజా సంక్షేమ ప్రభుత్వం’ సమాజంలో ఆర్థిక అసమానతలను సృష్టించడం ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని ఎప్పటికీ ప్రోత్సహించదని అన్నారు. “బ్యాంకులు మరియు రైల్వేల ప్రైవేటీకరణ మాత్రమే 5 లక్షల మంది ఉద్యోగులను ‘బలవంతంగా పదవీ విరమణ’ చేస్తుంది, అంటే నిరుద్యోగులుగా చేస్తుంది. ముగిసే ప్రతి ఉద్యోగంతో, లక్షలాది కుటుంబాల ఆశలు పోతాయి. ‘ప్రజా సంక్షేమ ప్రభుత్వం’ సామాజిక స్థాయిలో ఆర్థిక అసమానతలను సృష్టించడం ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని ఎప్పుడూ ప్రోత్సహించవద్దు” అని వరుణ్ గాంధీ ట్విటర్లో తెలిపారు.
కాగా, వరుణ్ గాంధీ తన సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గత వారంలో బ్యాంకు మోసాలపై కేంద్రాన్ని నిందించారు. అలాగే, గతేడాది అక్టోబర్లో యుపిలోని లఖింపూర్ ఖేరీ హింసాకాండలో మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ తల్లి మేనకా గాంధీతో కలిసి రైతులకు మద్దతు కూడా తెలిపారు. ఈ మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను సమర్పించిన కొన్ని రోజుల తర్వాత వరుణ్ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలనీ సూచించారు. దేశంలోని ముఖ్యమైన వనరులను ప్రైవేటీకరణ పేరుతో అమ్మితే దేశానికి ఏం జరుగుతుందో ఆలోచించండి’ అని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ