పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి (జనవరి 29, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం నాడు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
“మేము 16 రాజకీయ పార్టీల నుండి ఒక ప్రకటనను విడుదల చేస్తున్నాం. రేపు పార్లమెంటులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాము. వ్యవసాయ చట్టాలు ప్రతిపక్షం లేకుండా సభలో బలవంతంగా ఆమోదించబడడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం” అని ఆజాద్ వెల్లడించారు. ఈ 16 పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, పీడీపీ, కేరళ కాంగ్రెస్(ఎం), ఆర్ఎస్పీ, ఐయుఎంఎల్, ఎండీఎంకే, ఏఐయూడీఎఫ్, జీకేఎన్సీ ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ