‘ప్రళయ్’ భారత్ అమ్ముల పొదిలో చేరిన మరో అద్భుత అస్త్రం. ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను డీఆర్డీవో బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా లోని బాలాసోర్ కేంద్రం వద్ద ఈ మిస్సైల్ పరీక్ష నిర్వహించారు. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి చేధిస్తుందని డీఆర్డీవో తెలిపింది. దీనిని భూతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యంపై ప్రయోగించే అవకాశం ఉంటుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 500-1,000 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. DRDO తయారు చేసిన యుద్ధభూమి క్షిపణి ఈ ‘ప్రళయ్’.
‘ప్రళయ్’ భారతీయ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాం పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ నుంచి ‘ప్రళయ్’ క్షిపణిని ప్రయోగించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDO ని అభినందించారు. ఉపరితల క్షిపణిని వేగంగా అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు DRDO ను ఆయన కొనియాడారు. ఈ క్షిపణి ఆధునిక సాంకేతికతలతో కూడిన కొత్త తరం ఉపరితల క్షిపణి అని తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ ఇండక్షన్ సాయుధ దళాలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ