కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించి, చివరకు చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్ బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. భగభగమండే సూర్యుడిపై కన్నేసింది. ప్రచండ భానుడిపై అధ్యయనం చేయడానికి సంకల్పించింది. దీనికోసం ఇదివరకే ఆదిత్య ఎల్-1 ప్రాజెక్ట్ను చేపట్టింది ఇస్రో. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను యాక్టివ్ మోడ్లోకి తీసుకుని రాబోతోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1ను ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 మిషన్ త్వరలో పట్టాలెక్కిస్తామని, సెప్టెంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ప్రయోగించిన రోజు నుంచి ఈ మిషన్ సూర్యుడిని సమీపించడానికి సుమారు 120 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సోమనాథ్ తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ను దీనికోసం వినియోగిస్తామని వివరించారు. ఇప్పటికే ఈ రాకెట్, శాటిలైట్ బెంగళూరులోని యూఆర్ రావు సెంటర్ నుంచి శ్రీహరికోటకు చేరుకుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE