ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 3, శుక్రవారం) సాయంత్రం 4.30 గంటలకు అస్సాంలోని బార్పేటలోని కృష్ణగురు సేవాశ్రమంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కృష్ణగురు సేవాశ్రమ భక్తులను ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
పరమగురు కృష్ణగురు ఈశ్వర్ 1974 సంవత్సరంలో అస్సాంలోని బార్పేటలోని నసత్ర గ్రామంలో కృష్ణగురు సేవాశ్రమాన్ని స్థాపించారు. ఆయన గొప్ప వైష్ణవ సన్యాసి శ్రీ శంకరదేవ అనుచరుడు అయిన మహావైష్ణవ్ మనోహర్దేవ యొక్క తొమ్మిదవ వారసుడు అని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం నిర్వహించే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తన జనవరి 6 నుండి కృష్ణగురు సేవాశ్రమంలో నెల రోజుల పాటుగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE