తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇకపై అన్ని పని దినాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వచ్చే తెలంగాణలోని అన్ని సాధారణ మరియు ప్రసూతి ఆసుపత్రులలో సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య సాయంత్రం సమయంలో కూడా ఔట్ పేషెంట్ సేవలు కొనసాగించనున్నారు.
అలాగే అన్ని ప్రభుత్వ, మెటర్నిటీ ఆస్పత్రుల్లో ప్రతి రోజూ ఉదయం 7.30 గంటల నుంచి ఔట్ పేషెంట్ స్లిప్ ఇష్యూ కౌంటర్లను ప్రారంభించి, రోజువారీ ఔట్ పేషెంట్ సేవలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై చివరి వరకు కొనసాగేలా చూడాలని అన్ని బోధనాసుపత్రులు, ప్రసూతి ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు తెలంగాణ డీఎంఈ డాక్టర్ కే రమేష్ రెడ్డి శుక్రవారం ఒక సర్క్యులర్లో సూచించారు. ఇక ఉదయం వేళల్లో సంబంధిత జబ్బులకు రక్త నమూనాలను సేకరించి సాయంత్రానికి రిపోర్ట్స్ రెడీ చేయాలని, సాయంత్రం ప్రారంభమయ్యే ఓపీ సేవల్లోనే సంబంధిత రోగులకు మందులు రాసివ్వాలని సూచించింది. ఓపీ సమయాల్లో ల్యాబ్లు కూడా పని చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ