ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి కోర్సుల వివరాలను తెలియజేసేందుకు “ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్” ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చదువుకు సంబంధించిన అంశాలతో పాటుగా భవిష్యత్లో వారు ఎంచుకోబోయే ఉపాధి కోర్సులు, వాటిద్వారా వారు పొందబోయే ఉద్యోగాల వివరాలను ఈ https://apcareerportal.in/ పోర్టల్ ద్వారా తెలియజేస్తున్నారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ పోర్టల్ ఉపయోగపడనుంది. ఏపీఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో ఈ పోర్టల్ ను నిర్వహించనున్నారు. ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్ లో విద్యార్థులు తమ చైల్డ్.ఇన్ఫో ద్వారా రిజిస్టర్ అయ్యి, ప్రొఫైల్ వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu