ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి సహా విద్యాశాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నత విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని గుర్తించి జూన్ నాటికి నియామక ప్రక్రియ చేపట్టాలి.
- దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న కేసులపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించుకోవాలి.
- ట్రిపుల్ ఐటీలలో కూడా సిబ్బంది నియామకం సహా ఇతర పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలి.
- అలాగే ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నాక్ అక్రిడిటేషన్ సాధించాలి.
- దీనికోసం ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ వచ్చే మూడేళ్ళలో ప్రమాణాలు అందుకోవాలి.
- ఒకవేళ నాక్ అక్రిడిటేషన్ సాధించలేని పక్షంలో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి.
- ఇక కాలేజీలలో వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యతను స్కిల్ యూనివర్సిటీకి అప్పగిస్తున్నాం.
- దీనికోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
- కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టి విద్యార్థులకు సంబంధిత శిక్షణ అందించాలి.
- ప్రధానంగా బోధనా సిబ్బంది సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీ తరహాలో సెంట్రల్ ఆంధ్రా పరిధిలో మరో స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలి.
- అమ్మవడి, విద్యాదీవెన, వసతి దీవెన తదితర పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా స్కూల్స్ మరియు కాలేజీలలో డ్రాపౌట్స్ ను నిరోధించాలి.
- అలాగే స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, రిస్క్ ఎనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టి వచ్చే ఏడాదికి పాఠ్యాంశాలుగా అందించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE