వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)-2023 ఫైనల్ కు భారత్ జట్టు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చేరుకోగా, ఇంకో స్థానం కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకుంది. అయితే న్యూజిలాండ్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మొదటి టెస్టులో శ్రీలంక జట్టు ఓడిపోవడంతో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు ఫలితం తేలకముందే భారత్ జట్టుకు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ బెర్త్ ఖరారయింది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023/రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుండి 11 వరకు లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరుగనుండగా, ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు. సౌతాంప్టన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ను ఓడించి ప్రారంభ ఎడిషన్ను గెలుచుకుంది.
మరోవైపు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ జట్టు 2-1 తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో 2-1 తో ఆధిక్యాన్ని సాధించడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు చేరడానికి మార్గం సుగమం చేసుకుంది.
కాగా ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సైకిల్/సీజన్ 2021, జూలై నుండి 2023 జూన్ వరకు నడువనున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి తొమ్మిది టెస్ట్ జట్లు పాల్గొంటుండగా, ఒక్కొక్కటి ఆరు సిరీస్లను (మూడు స్వదేశంలో మరియు మూడు బయట) ఆడుతున్నాయి. ఈ సీజన్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, భారత్ జట్లు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్లో తలపడనున్నాయి. ఆస్ట్రేలియా 66.67 పర్సెంటేజ్ తో (152 పాయింట్స్) మొదటి స్థానంలో, భారత్ జట్టు 58.8 పర్సెంటేజ్ తో (127 పాయింట్స్) రెండో స్థానంలో నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE