సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “కేసులు గెలవాలంటే ప్రామిసరీ నోటు రాసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?” అనే అంశం గురించి వివరించారు. ఆర్ధిక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వేరే వారి నుంచి అప్పు తీసుకోవడం జరుగుతుందని, ఒకప్పుడు సంబంధాల వలన కానీ, మాట వలన కానీ ఎలాంటి పత్రాలు లేకుండా అప్పు ఇవ్వడం జరిగేదన్నారు. తీసుకునే వాళ్ళు అలాగే తిరిగి ఇచ్చేయడం జరిగేదన్నారు. అయితే తాజా పరిస్థితుల్లో ఎవిడెన్స్, ప్రామిసరీ నోట్, చెక్స్ లేకుండా ఎవరూ అప్పులు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రామిసరీ నోటు రాసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇