తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి ఇక్కడి పేద ప్రజల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకుండా కేంద్ర సర్కార్ తెలంగాణ ప్రజల గోస తీస్తోందన్నారు. దీనిపై ఆవేదన చెందుతూ, కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు గత రెండు నెలల పనుల నిమిత్తం 110.35 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. కానీ పేద ప్రజలు చేసిన పని వేతనం కూడా కేంద్రం రెండు నెలల నుంచి ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఈ 110.35 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మంత్రి ఎర్రబెల్లి తన లేఖలో కేంద్రమంత్రిని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE