హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ‘వార్ రూం’, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడులు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు ప్రతిపక్షాలను వేధిస్తున్నాయని పేర్కొంటూ టీ-కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. అలాగే సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ వరకు బయలు దేరిన కాంగ్రెస్ నేతలను గేటు వద్ద బారికేడ్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా మంగళవారం రాత్రి మాదాపూర్లోని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సునీల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పలు పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడి కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి చెందిన సెల్ఫోన్లతో పాటు కంప్యూటర్లు, ల్యాప్టాప్లను అధికారులు సీజ్ చేశారు. అయితే పోలీసుల దాడిని ఖండించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీగా గుమికూడిన కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ధర్నాకు దిగాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ