తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 19, గురువారం నాటికి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.116.26 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క్వారంటైన్ ఏర్పాట్లు, స్క్రీనింగ్ అవసరాల కోసం 83.25 కోట్లు కేటాయించారు. అలాగే స్పెషల్ ల్యాబ్స్, పరికరాల కోసం రూ.33 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నిధులు విడుదల చేస్తూ విపత్తు నిర్వహణ శాఖ మార్చ్ 19, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Home తెలంగాణ
- Advertisement -