తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అలాగే సమావేశాల తొలిరోజునే 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రిగా మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958.51 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను రూపొందించారు. మరోవైపు శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ 2022-22 ముఖ్యంశాలు:
- రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు
- క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు
- దళితబందుకు రూ.17700 కోట్లు
- పల్లె ప్రగతి పథకం కోసం రూ.3330 కోట్లు
- పట్టణ ప్రగతి పథకం కోసం రూ.1394 కోట్లు
- కొత్త వైద్య కళాశాలలకు రూ.1000 కోట్లు
- అటవీ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు
- తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటికి రూ. 16,144 కోట్ల పంట రుణాలు మాఫీ, ఈ దఫాలో ఇప్పటి వరకు మొత్తం 5.12 లక్షల మంది రైతులకు లబ్ది. ఇక రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీకి నిర్ణయం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీకి నిర్ణయం.
- వ్యవసాయ రంగం – రూ.24,254 కోట్లు
- పామాయిల్ సాగు కోసం – రూ.1000 కోట్లు
- తెలంగాణకు హరితహారం కోసం – రూ.932 కోట్లు
- సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం. సొంతస్థలం ఉన్న 4 లక్షల మందికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఎమ్మెల్యేల పరిధిలో నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు చొప్పున మొత్తం 3.57 లక్షల ఇళ్లు కేటాయించనుండగా, సీఎం పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు కేటాయించనున్నారు
- భవన నిర్మాణరంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం సరికొత్త పథకం. మొదటి విడతలో లక్ష మందికి సబ్సిడీపై మోటార్ సైకిళ్లను అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటన.
- మహిళా యూనివర్సిటీ కోసం – రూ.100 కోట్లు
- ఆసరా పెన్షన్ల కోసం – రూ.11,728 కోట్లు, ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం 57 ఏళ్ల కొత్త లబ్ధిదారులకు కూడా ఆసరా పెన్షన్లు అందజేత.
- విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ పాలసీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం
- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం – రూ.2,750 కోట్లు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం – రూ.12,000 కోట్లు
- మన ఊరు-మన బడి కార్యక్రమం కోసం – రూ.7,289 కోట్లు
- ఎస్టీల సంక్షేమం – రూ.12,565 కోట్లు
- బీసీల సంక్షేమం – రూ.5,698 కోట్లు
- బ్రాహ్మణుల సంక్షేమం – రూ.177 కోట్లు
- దూప దీప నైవేద్య పథకం కోసం – రూ.12.50 కోట్లు
- పోలీస్ శాఖ రూ.9,315 కోట్లు
- గీత కార్మికుల సంక్షేమం కోసం త్వరలో రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం.
- రాష్ట్రంలో అన్నిప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజినిక్ కిట్స్ పంపిణీ, ఏడు లక్షల మంది విద్యార్ధినులకు ప్రయోజనం.
- ఆర్టీసీ బలోపేతం కోసం – రూ.1500 కోట్లు
- హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉచిత తాగునీటిపథకం (రోజుకు 20 లీటర్లు) కోసం- రూ.300 కోట్లు
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు, ఏయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి రూ.500 కోట్లు
- పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు కనెక్టవిటీ కోసం – రూ.500 కోట్లు
- ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఆవాసాల కోసం త్రాగునీటి సౌకర్యం కలిపించేందుకు – రూ.1200 కోట్లు
- అర్బన్ మిషన్ భగీరథ – రూ.800 కోట్లు
- కాళేశ్వరం టూరిజం సర్య్యూట్ కోసం – రూ. 750 కోట్లు
- రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం – రూ.1542 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ