ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 17, సోమవారం నాడు గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్ ను ప్రారంభించారు. దీంతో ఈ రోజు నుంచి సచివాలయాల్లో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), కెనరా బ్యాంక్ల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న15,004 గ్రామ/వార్డు సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ/ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం అందించే 543 రకాల సేవలకు అవసరాన్ని బట్టి ఇకపై వినియోగదారులు డిజిటల్ పేమెంట్ చేయవచ్చు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వ్యవస్థలో మరో అడుగు ముందుకేసి డిజిటల్ పేమెంట్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu