ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. తద్వారా పనులు వేగవంతం కావడంతో పాటు పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఈ-స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు పతివాడ నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ సహా పలువురు ఉన్నతాధికారులు, ఇంకా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-స్టాంపింగ్ సేవల పనితీరును అధికారులు సీఎం జగన్కు వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE