ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద అందించే ఆర్ధిక సహాయాన్ని అదనంగా 8.21 లక్షల మందికి అందించాలని నిర్ణయం. ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయించాలని నిర్ణయం.
- 9,712 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం.
- ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ 2006 సవరణ, ప్రత్యేక ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
- 44,500 పాఠశాలల్లో మూడు దశల్లో నాడు -నేడు కార్యక్రమానికి ఆమోదం.
- రాయలసీమ కరవు నివారణకు రూ.40వేల కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు.
- రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ విధానం-2020 కి ఆమోదం.
- సీపీఎస్ రద్దు పోరాటంలో టీచర్లు చేసిన ఆందోళనపై పెట్టిన కేసులు రద్దు.
- గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ఆమోదం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu