దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సోమవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 90% మంది వయోజన జనాభాకు (అడల్ట్ పాపులేషన్) పూర్తి కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపారు. “ఎంత అసాధారణమైన ఘనత, ప్రధాని నరేంద్ర మోదీ యొక్క సబ్కా సాత్ సబ్కా ప్రయాస్ మంత్రంతో, భారతదేశం దాని వయోజన జనాభాలో 90% మందికి పూర్తి టీకాలు వేసింది. ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది. కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధిస్తాం” అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు.
మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 197.98 కోట్లు దాటింది. జూలై 4, సోమవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,98,21,197 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఇప్పటివరకు 3.69 కోట్లమందికిపైగా (3,69,12,764) మొదటి డోస్ వ్యాక్సిన్, 2,39,83,173 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు.
What an extraordinary feat!
With PM @NarendraModi Ji’s mantra of Sabka Saath, Sabka Prayas, India achieves complete vaccination of 90% of its adult population.
Way to go!
We will win the battle against the pandemic together! ✌🏻 pic.twitter.com/LnsvCa927L
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 4, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY