భారతీయ విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ నుంచి రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. 1999 ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం చైనా ఆధారిత షియోమీ గ్రూప్ యొక్క యాజమాన్యంలోని అనుబంధ సంస్థ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ₹5,551.27 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం తెలిపింది. సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలలోని ఈ నగదు ‘చట్టవిరుద్ధమైన చెల్లింపులకు’ సంబంధించి సీజ్ చేయబడిందని ఈడీ పేర్కొంది. అక్రమంగా బయటికి పంపిన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
అయితే షియోమీ ఇండియా అనేది చైనాకు చెందిన షియోమీ గ్రూప్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. MI బ్రాండ్ పేరుతో దేశంలో మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఖాతాలలో ఉన్న ఈ మొత్తం ₹5,551.27 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఖాతాలనుంచి మూడు విదేశీ ఆధారిత సంస్థలకు ₹5,551.27 కోట్లకు సమానమైన విదేశీ కరెన్సీని రాయల్టీ ముసుగులో పంపించిందని, ఇది ఫెమాలోని సెక్షన్ 4ను ఉల్లంఘిస్తుందని ఈడీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ చేసిన అక్రమ చెల్లింపులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏప్రిల్ ప్రారంభంలో, దర్యాప్తులో భాగంగా షియోమి కార్ప్ మాజీ భారత అధిపతిని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలిసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ