అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని, అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “సుస్థిర వ్యవసాయ విధానాలను అమలుపరుస్తూ, అటవీకరణను ప్రోత్సహించడంతో పాటు సముద్ర కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. పర్యావరణానుకూల జీవన విధానాలను పాటిస్తూ, కర్బన ఉద్గారాలను వీలైనంత మేర తగ్గించుకోవడంపైనా మనమంతా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ఈ సందర్భంగా భవిష్యత్ తరాలకు జీవనానుకూల వాతావరణాన్ని అందించేందుకు మనమంతా కంకణబద్ధులమవుదాం” అని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ