తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పనుందా? పదవ తరగతి పరీక్షల సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా 2 గంటల 45 నిమిషాలుగా ఉండే పరీక్షా సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించినట్లు అధికారులు తెలిపారు. అయితే గత యేడాది కూడా ఇదే మాదిరిగా పరీక్షా సమయాన్ని పొడిగించారు. ఈ యేడాది 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ యేడాది పరీక్షలలో 70 శాతం సిలబస్నే అమలు చేస్తున్నామని, ప్రశ్నపత్రంలో చాయిస్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వాలని మంత్రి పేర్కొన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో చాలా మంది విద్యార్థులు అధిక ఒత్తిడి లేకుండా పరీక్ష రాయడానికి ఇది ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయం ఉండనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ