తెలంగాణలో గత 11 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన ‘ప్రాణహిత పుష్కరాలు’ నేటితో (12వ రోజు) ముగియనున్నాయి. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాది మంది తరలి వచ్చారు. ప్రాణహిత పుష్కరాలు 2022 ఏప్రిల్ 13న ప్రారంభమయ్యాయి. అయితే పుష్కరాలకు నేడే చివరిరోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు ఘాట్లకు తరలివచ్చారు. క్యూ లైన్లు మొత్తం అశేష భక్తజనంతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఘాట్ల నిర్మాణం చేపట్టింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వేమనపల్లి గ్రామాల వద్ద కొన్ని ఘాట్లు, అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద మరికొన్ని ఘాట్లు ఏర్పాటు చేసింది. మరోవైపు జయశంకర్ జిల్లా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లకు భక్తులు భారీగా తరలి వచ్చారు. నేటి రాత్రి 7:30 గంటలకు పుష్కరాల ఘడియలు ముగియనుండగా.. మరో 12 సంవత్సరాల తర్వాత ప్రాణహిత నదికి పుష్కరాలు రానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ