ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకం కోసం అర్హతకై మరికొన్ని నిబంధనలను అమల్లోకి తెస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
లబ్ధిదారులు విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్ల దాటితే అమ్మఒడి పథకం వర్తించదని, 300 యూనిట్లలోపే ఉండాలని స్పష్టం చేశారు. నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థుల హాజరు 75శాతం ఉండాలని పేర్కొన్నారు. బియ్యం కార్డు కొత్తది ఉండాలని, అలాగే కొత్త జిల్లాల ఆధారంగా ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్చుకోవాలని చెప్పారు. ఇక బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసుకోవడంతో పాటుగా, బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్ గా ఉండేలా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ