ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి వైస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బుధవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జనవరి 28 వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉపఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – జనవరి 11
- నామినేషన్లకు ఆఖరితేదీ – జనవరి 18
- నామినేషన్ల పరిశీలన – జనవరి 19
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – జనవరి 21
- ఎన్నిక జరిగే తేదీ – జనవరి 28
- పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – జనవరి 28 సాయంత్రం 05:00 కు
- ఎన్నికల ముగింపు తేదీ – ఫిబ్రవరి 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ