ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో సోమవారం నాటికి అల్పపీడనం దశనుంచి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తుఫాన్ సూచన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను ఒడిశా ప్రభుత్వం హెచ్చరించింది. తుఫాన్ సూచన దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని తీర ప్రాంత, పరిసర జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE