దేశవ్యాప్తంగా ‘మీజిల్స్’ (తట్టు) వ్యాధి వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం ఎలర్ట్ అయింది. దీనిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియపై కీలక సూచనలు చేసింది. అలాగే మూడు రాష్ట్రాలకు వైద్య బృందాల తరలింపు ప్రక్రియ చేపట్టింది. రాంచీ (జార్ఖండ్), అహ్మదాబాద్ (గుజరాత్), మలప్పురం (కేరళ)లకు ఉన్నత స్థాయి బృందాలను మోహరించింది. ఆయా రాష్ట్రాల్లో చిన్నారుల్లో మీజిల్స్ కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు వైద్య బృందాలను పంపిస్తున్నట్లు పేర్కొంది. ముంబయిలో తట్టు వ్యాధి సోకి ఏడాది వయసున్న బాలుడు మరణించిన మరుసటి రోజు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ బృందాలు మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుదలపై దృష్టి సారించనున్నాయి.
అధికారిక ప్రకటనలో.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మూడు నగరాల్లో మీజిల్స్ కేసుల పెరుగుతున్న ధోరణిని బృందాలు పరిశీలిస్తాయని తెలిపింది. మీజిల్స్ వ్యాప్తిని పరిశీలించడంలో కేంద్రం ఏర్పాటు చేసిన బృందాలు రాష్ట్ర ఆరోగ్య అధికారులకు సహాయం చేస్తాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖలతో పాటు బృందాలు అవసరమైన నియంత్రణ మరియు నియంత్రణ యొక్క కార్యాచరణను సులభతరం చేస్తాయని ప్రకటన పేర్కొంది. 9 నెలలు నుంచి ఐదేళ్ల వయస్సున్న పిల్లలకు తట్టు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని సూచించింది. ఇక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం.. ముంబై నగరంలో మొత్తం 220 కేసులు నమోదవగా, 12 మరణాలు సంభవించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE