పార్లమెంటు బడ్జెట్-2022 మొదటి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 11న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14, సోమవారం నాడు ప్రారంభమై, ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటి విడతలో రాజ్యసభ (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్సభ (సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి.
కాగా దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభలను ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఏకకాలంలోనే సమావేశాల నిర్వహణకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలు కూడా ఉదయం 11 గంటల నుంచి సమావేశం కానున్నాయి. అలాగే సభ్యుల సిట్టింగ్ కోసం భౌతిక దూరం పాటించేలా లోక్సభ, రాజ్యసభల్లో చాంబర్స్ మరియు గ్యాలరీలను కూడా ఉపయోగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ